నల్లగొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని, నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భం ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు టాస్క్ఫోర్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
తిప్పర్తి పీఎస్ పరిధిలోని రైల్వేస్టేషన్ రోడ్డు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పద రీతిలో మూడు కార్లలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.
వారిని అదుపులోకి తీసుకొని కార్లలో తనిఖీలు చేయగా రెండు వందల కిలోల గంజాయి పట్టుబడిందన్నారు.
నిందితుల వద్ద నంచి ఐదు సెల్ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.