హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్లో శనివారం జయంతి ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు.రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా ఉత్సవాలను జరుపాలని పిలుపునిచ్చారు. బంజారా జాతి అభివృద్ధికి సేవాలాల్ మహరాజ్ చేసిన సేవలు ప్రతి ఒకరికీ తెలుపాలని సూచించారు. 2 వేల మంది బంజారా ప్రతినిధులతో బంజారాహిల్స్లోని సేవాలాల్ మహరాజ్ భవనంలో వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు గిరిజనులకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టి, గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం పెంచి వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపారని కొనియాడారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, హైదరాబాద్ మారెట్ చైర్మన్ అనిత, ఆర్అండ్బీ సీఈ మోహన్నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, దుర్గా దీప్లాల్చౌహాన్, సోమ్లాల్ నాయక్, గుగులోత్ శ్రీరామ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.