హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యాశాఖ కొత్తగా 231 అదనపు తరగతి గదులను నిర్మించనున్నది. ఒక్కో తరగతి గదిని రూ.13.50 లక్షలతో నిర్మించనున్నది. ఇప్పటికే వీటి నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది.
కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు 9, 10 తరగతుల్లోని విద్యార్థులకు ఉపయోగపడేలా సైన్స్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణానికి మొత్తంగా రూ.31.18 కోట్లను విద్యాశాఖ మంజూరుచేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ టెండర్లను పూర్తిచేసి, గుత్తేదారులకు అప్పగించనున్నది.