చెన్నై: తమిళనాడులోని 27 జిల్లాల్లో నేటి నుంచి టీ షాపులు తెరుచుకున్నాయి. మిగితా 11 జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. చెన్నైతో పాటు 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలతో పాటు టీ షాపులను తెరిచారు. నిజానికి జూన్ 21వ తేదీన వరకు తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను పొడిగించింది. టీ షాపుల్లో టేకవే సర్వీసులకు అమనుతి ఇచ్చారు. ఆ షాపులు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి. టీ, కాఫీ లాంటి వాటిని తీసుకువెళ్లేందుకు స్వంత కప్పులు, గిన్నెలు తీసుకువెళ్లాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ సూచన చేశారు. టీ షాపుల వద్ద ఎవరికీ టీ తాగే అనుమతి లేదు. స్వీటు షాపులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరవనున్నారు. కానీ కేవలం టేకవే సర్వీసులు మాత్రమే ఉంటాయి. రెస్టారెంట్లు, బేకరీలకు ఇప్పటికే టేకవే సర్వీసులు మొదలయ్యాయి. నేటి నుంచి గవర్నమెంట్ ఈ-సర్వీస్ సెంటర్లు కూడా ప్రారంభం అవుతున్నాయి. నిర్మాణ కంపెనీలు 50 శాతం ఉద్యోగులతో పనిచేసేందుకు అమనుతి కల్పించారు. కోయంబత్తూరు, నీల్గిరి, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తిరువరూర్, నాగపట్టణం, మైలదుతరై జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నారు.