హైదరాబాద్ : నగరంలోని శామీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. రన్నింగ్ చేస్తూ గుండెపోటుతో ఆర్మీ అధికారి సత్తార్ సింగ్(43) మృతి చెందాడు. శిక్షణలో భాగంగా 30 కిలోమీటర్ల పరుగులో సత్తార్ సింగ్ శుక్రవారం ఉదయం పాల్గొన్నారు. శామీర్పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రన్నింగ్ చేస్తుండగా సింగ్ కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మెహిదీపట్నం రెజిమెంటల్లో సత్తార్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మీలో ఏఎస్ఐ ర్యాంకు అధికారిగా సత్తార్ సింగ్ ఉన్నారు.