హైదరాబాద్ జనవరి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ తనిఖీలకు సిద్ధంగా ఉన్నాయా అని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆరా తీశారు. గురువారం ఆమె సచివాలయంలో మెడికల్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో కాలేజీ పరిస్థితిపై వైద్య అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఏర్పాటు చేయబోయే ఎనిమిది కాలేజీల పనుల గురించి ఆరా తీశారు. త్వరలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని కాలేజీల పరిస్థితిపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.