KTR | హైదరాబాద్: కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న తమ నిబద్ధతను ఎవరూ దెబ్బతీయలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రగతి రథచక్రాలను ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు.
‘అసెంబ్లీ సాక్షిగా మరోసారి కుండ బద్దలు కొడుతున్నా. కేంద్ర సర్కారుకు కార్పొరేట్ ముఖ్యమేమో. కానీ, మాకు మాత్రం కామన్ మ్యానే ముఖ్యం. సామాన్య ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ సంకల్పం. అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ఏకైక లక్ష్యం. దేశంలో కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. తెలంగాణ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్’ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి స్ఫూర్తినిస్తోందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కేంద్రం నుంచి మొదలుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ పథకాలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. అందుకే ఈ రోజు తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం కావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇవాళ దేశం చూపు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉంది అని అన్నారు.
తెలంగాణ ప్రగతిలాగే దేశం పరుగులు పెట్టి ఉంటే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కల ఎప్పుడో నెరవేరేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘దొంగపై దాడిని.. దేశంపై దాడిగా అభివర్ణించడం ఏంటి. ప్రధాని, అదానీ మాత్రమే ఈ దేశానికి ప్రతినిధులా..? దేశమంటే ప్రధాని, అదానీ మాత్రమే కాదు. దేశమంటే 140 కోట్ల ప్రజలని వాళ్లకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో అదానీ-ప్రధాని తప్ప మరో చర్చ లేదు’ అని మంత్రి అన్నారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే కాకుండా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల ప్రభుత్వంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అందుతున్న అద్భుతమైన పరిపాలనా ఫలాలు.. దేశ ప్రజలకు కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మోదీ పాలనలో అన్నీ హైయెస్టే..అవేంటో తెలుసా? : మంత్రి కేటీఆర్
KTR | బరాబర్ మాది కుటుంబపాలనే.. విపక్షాలకు మంత్రి కేటీఆర్ కౌంటర్
మీ మేకిన్ ఇండియా ఎక్కడవోయిందో తెలువదు.. మేము మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలిస్తున్నాం