ఉప్పునుంతల, జూన్ 5 : పిడుగుపడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వంగూరు మండల ఉల్పర గ్రామానికి చెందిన సుద్దమోని రాజు(35) నాగర్కర్నూల్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నా రు. గురు,శుక్రవారాలు సోమశిల వద్ద సీఎం బందోబస్తుకు వెళ్లి సొంత గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో మామిళ్లపల్లి సమీపంలో వద్ద కారు ఆపి మలవిసర్జనకు వెళ్లగా అకస్మాత్తుగా పిడుగుపడటంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య సువర్ణ, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఉప్పునుంతల పోలీసులు కేసు నమోదు చేశారు.