హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు తగు చర్యలు చేపట్టాలి.. ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ చేపట్టాలని డీఆర్డీవోలను సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. రాష్ట్రంలోని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, అదనపు డీఆర్డీవోలతో మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లపై మహిళా సంఘాలకు కమీషన్ పెండింగులో ఉంటే వెంటనే పౌరసరఫరాల శాఖకు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ‘లక్పతి దీదీ’ ఇంటింటి సర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. పంచాయతీల వారీగా వ్యక్తిగత ఆర్థిక అభివృద్ధితో పాటు గ్రామ మౌలిక సౌకర్యాలను సర్వే ద్వారా గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.