హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ స్టాండప్ కమెడియన్, హాస్యనటుడు కపిల్శర్మ ప్రశంసించారు. గురువారం ఆయన ముంబైలోని దాదాసాహెబ్ ఫాలే చిత్రనగరిలో ఎంపీ సంతోష్కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కపిల్శర్మ మాట్లాడుతూ.. స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరికినప్పుడే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని, దాంతో ప్రతి సంఘటనను పాజిటివ్గా తీసుకునే శక్తి మెదడుకు అందుతుందని పేర్కొన్నారు.
ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం తన మనసును కదిలించిందని, ‘మనం మన కోసం కాదు ఇతరుల కోసం కూడా’ అనే భావనను ప్రేరేపించిందని తెలిపారు. తన షో వీక్షిస్తున్న ప్రతి ఒకరూ ఒక మొకను నాటాలని, సంతోష్కుమార్ పచ్చని ఆశయానికి అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు.