హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): నూతనంగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీలకు డీఎంఈ త్రివేణి ప్రిన్సిపాళ్లను నియమించారు. కుత్బుల్లాపూర్ కాలేజీకి మురళీకృష్ణ, యాదాద్రికి శ్రవణ్ కుమార్, నర్సంపేటకు భిక్షపతి, నారాయణపేటకు రామకృష్ణ, ములుగుకు రాజేంద్రప్రసాద్, మెదక్కు రవీందర్, మహేశ్వరానికి సత్యనారాయణ, జోగులాంబ గద్వాలకు నవకల్యాణిని నియమించారు.