హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ యువ సెయిలర్లు ఇటలీలో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ క్లాస్ అండర్-17 వరల్డ్ చాంపియన్షిప్ లో సత్తా చాటారు. భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది మంది సెయిలర్లు వ్యక్తిగత రేసుల్లో 16 పతకాలు గెలిచారు. 52 దేశాల బోట్లు పోటీపడిన సిల్వర్ ఫ్లీట్ విభాగంలో చంద్రలేఖ, రిష్విత ద్వయం ఓవరాల్గా రజత పతకాన్ని గెలుచుకుంది.
సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్ అయిన రవికుమార్-బద్రినాథ్ 8వ స్థానాన్ని కైవసం చేసుకోగా.. వినోద్ దండు-మణి నిల్కొండ్ల ద్వయం 11 రేసుల రెగట్టాలో 11వ స్థానంలో నిలిచింది.