వేములవాడ, ఆగస్టు 18 : వేములవాడ లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షలతో వీధి మారెట్జోన్ పేరుతో నిరుడు మార్చి 31న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 62 స్టాళ్ల ఏర్పాటుకు చేపట్టిన పనులను బండారి వెంకటేశ్ అనే కాంట్రాక్టర్ రూ.60.65 లక్షలకు పనులు దకించుకుని పనులు ప్రారంభించాడు.
40 శాతం పూర్తయిన పనులకు ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.27 లక్షల ట్రెజరీ చెకును సెప్టెంబర్లో కాంట్రాక్టర్కు అందజేశారు. ఏడాది కావస్తున్నా చేసిన పనులకు నగదు జమ కాకపోగా.. ఇటీవలే మళ్లీ అధికారులు కాంట్రాక్టర్ను పిలిచి మందలించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.