హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉ ద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డి మాండ్ చేసింది. 2026 ఏప్రిల్ నుంచి వేతన సవరణను వర్తింపజేయాలని కో రింది. మంగళవారం హైదరాబాద్లో సమావేశమైన పలు సంఘాల నేతలు 9 డిమాండ్లపై తీర్మానం చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీచేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ నిబంధనల ప్రకారం ప దోన్నతులు కల్పించాలని, కొత్త ప్రాజెక్ట్లను జెన్కో ద్వారా చేపట్టాలని కోరారు. సమావేశంలో జేఏసీ నేతలు కోడెపాక కుమారస్వామి, వెంకన్న, ఆర్ సుధాకర్రెడ్డి, పీ భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.