Vote from Home | హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు ఫ్రం హోం కోసం ఏప్రిల్ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఫారం -డీ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఆర్వో వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుందని తెలిపారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ 2.09 లక్షల మంది పోస్టల్, హోం ఓటింగ్ను వినియోగించుకున్నారని గుర్తు చేశారు. చంచల్గూడలో ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 85 ఏండ్లు దాటిన వృద్ధులు 1.85 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 90,365 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో హోమ్ ఓటింగ్కు అవకాశం కల్పిస్తామని సీఈవో పేర్కొన్నారు.