హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదలయ్యింది. శనివారం నుంచి ఫీజు చెల్లి ంపు, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. ఈ నెల 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 20 26 జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక పేపర్కు 750, రెండు పేపర్లకు రూ. వెయ్యి ఆన్లైన్లో ఫీజుగా చెల్లించాలి. గతం లో 2010కి ముందు రిక్రూట్ అయి న టీచర్లకు టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు సు ప్రీంకోర్టు తీర్పు మేరకు అందరికి టెట్ అర్హత తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెండేండ్లలోపు టెట్లో పాస్ కావాలి. ఐదేం డ్ల లోపు సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు ఇచ్చింది. టెట్ లేకపోతే ఉ ద్యోగం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 2010కి ముందు రిక్రూట్ అయిన వారు టెట్రాసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దరఖాస్తు సహా పూర్తి వివరాల కోసం https://schoo ledu.telanga na.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. 7093708883/7093708884/ 7093958881/ 7093468882 నంబర్లను సంప్రదించవచ్చు.
మరో 139 బడుల్లో వొకేషనల్ విద్య
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : మరో 139 సర్కారు బడుల్లో వొకేషనల్ కోర్సును విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 409 బడుల్లో వొకేషనల్ విద్య అందిస్తుండగా, తాజాగా మరో 139 బడులకు విస్తరించింది. ఈ 409 బడుల్లో సమగ్రశిక్ష కింద 275, పీఎం శ్రీ బడులు 134 ఉన్నా యి. 12 వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. 2015-16లో బడుల్లో వొకేషనల్ ఎడ్యుకేష న్ ప్రారంభమయ్యింది. తొలుత 20 బడుల్లో వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టారు. నిరుడు 99 బడుల్లో వొకేషనల్ విద్య ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 409 బడులకు విస్తరించారు. కొత్తగా ఈ విద్యాసంవత్సరం 136 బడుల్లో ప్రవేశపెట్టారు. వీటిలో 106 పీఎం శ్రీస్కూళ్లు, మరో 33 సాధారణ స్కూ ళ్లున్నాయి. ఈ 136 బడుల కోసం ప్ర భుత్వం రూ. 137.92 కోట్లు మం జూరు చేసింది. వొకేషనల్ కోర్సులు న్న బడుల్లో 15 ట్రేడ్స్లో శిక్షణ ఇస్తున్నారు. అగ్రికల్చర్, అపారెల్, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ ఐటీఈఎస్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్, హెల్త్కేర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ప్లంబింగ్, టెలికామ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ వంటి కోర్సులున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగా లు కల్పిస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి రూ. 15వేల నుంచి రూ. 27వేల వరకు జీతాలు అందుతున్నాయి.