హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): వివిధ క్యాటగిరీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు జాతీయ అ వార్డులు అందించనున్నట్టు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎంఎస్ఎంఈ అదనపు అభివృద్ధి కమిషనర్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మే 10లోపు dashboard. msme. gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. తయారీ రంగం, సేవ ల రంగం, ఎగుమతి ఆధారిత తయారీ, సేవలు, సాంకేతికతతో కూడిన పరిశ్రమలు, మహిళ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ తదితర క్యాటగిరీలకు విడివిడిగా రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తామని వివరించారు.