హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏలకు పేసేల్ ఇచ్చి వారి సర్వీస్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత గ్రామానికో వీఆర్ఏను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సీఎస్ శాంతికుమారిని ట్రెసా నేతలు కోరారు. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సీఎస్ను కలిశారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతోపాటు రెవెన్యూ శాఖలో వివిధ కింది స్థాయి కేడర్ల పదోన్నతులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.