హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవినీతిలో కూరుకుపోయిన విభాగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి ప్రత్యేక యాప్ను నెలరోజుల్లో రూపొందించాలని చెప్పారు. డ్రగ్స్ విషయంలో విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.