హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటం చేస్తుంటే, ఏపీ సీఎం జగన్ మాత్రం మోకరిల్లారని ఏపీ స్టూడెంట్, యూత్ జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఏపీకీ తీవ్రంగా అన్యాయం జరుగుతున్నా ఇక్కడి నేతలు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఎదుట మోకరిల్లి జగన్, చంద్రబాబు విభజన సమస్యలపై ఆయనను నిలదీయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీని నిలదీస్తున్నారని చెప్పారు.