హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Goutham reddy) భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్లో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. ఉదయం 11.25 గంటలకు నెల్లూరు క్యాంపు కార్యాలయానికి ఆయన భౌతికకాయం చేరుకోనుంది. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో యన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.