హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించింది. రిషికొండ మిలినియం టవర్స్లో క్యాంపు కార్యాలయాలను హై లెవెల్ కమిటీ గుర్తించింది.
శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని వెల్లడించింది. మొత్తం 2 లక్షల 27 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు, మిలినియం టవర్స్లో లక్ష 75 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని గుర్తించింది.