హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. సైబర్ నెట్ కేసులో నిందితుడిగా చంద్రబాబుతోపాటు ఇతరులు కూడా ఉన్నారు. ఈ కేసులో రూ.321 కోట్ల మేర స్కామ్ జరిగిందని సీఐడీ పేర్కొన్నది.