హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఏపీలోని గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సీఐ) జయకుమార్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం కోసం సీఐ డిమాండ్ చేస్తున్నాడని ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ కిరణ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో జయకుమార్పై వల వేసి పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో సోమవారం ఉదయం గుడివాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంతోపాటు సీఐ జయకుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు.