హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఇతర నాయకులు రావెల కిశోర్ బాబు, పార్థసారథి కలిశారు. హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను సీఎం కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రెండు, మూడుసార్లు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నెల 18న ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏపీ నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చే అవకాశం ఉంది.