రాజన్న సిరిసిల్ల : కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై ఆందోళన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నేతల నిరసన చేపట్టారు.
ఆదివారం అంబేద్కర్ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీగా ఉండి నిధులు తేలేని బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని లేదంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ, పార్టీ నేతలు అడ్డ గట్ల మురళి, నేరెల్ల శ్రీకాంత్ గౌడ్, బూర తిరుపతి, బోడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.