హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనుముల జగన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఎస్ సురేందర్రెడ్డిపై 990 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్కు 1,724 ఓట్లు రాగా, సురేందర్రెడ్డికి 734 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా రాజేశ్వర్రెడ్డి, కార్యదర్శులుగా ఖాజా విజారత్అలీ, ఇంద్రసేనారెడ్డ్లి, సంయుక్త కార్యదర్శిగా అనిరుధ్, ట్రెజరర్గా పాపయ్య, స్పోర్ట్స్అండ్ కల్చరల్ సెక్రటరీగా పీ రాములు విజయం సాధించారు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా హనుమంతరావు, మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా లావణ్యతో పాటు జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అంజలీదేవి, శిరీష, ప్రకాశ్, నరేశ్ గెలిచారు. అలాగే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షుడిగా విజయ్కుమార్రెడ్డి, కార్యదర్శిగా రాజశేఖర్రావు, ట్రెజరర్గా తులసీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రోహన్రావు, రోహిణిస్మిత, కీరవాణి శ్రీరమ్య ఎన్నికయ్యారు.