హైదరాబాద్ : ఈనెల 16 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్( Assembly Meeting ) సమావేశాలకు సంబంధించిన అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాదానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ( CS Ramakrishna Rao) ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు రావాల్సిన సమాధానాలు, సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలి, శాసనసభ సమావేశాల నేపథ్యంలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ రేపటిలోగా సమాధానాలు పంపించాలని అన్నారు.
నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ పరిపాలన, ఇంధనశాఖ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించి అధికంగా ప్రశ్నలున్నాయని, వీటన్నింటికీ వెంటనే సమాధానాలు పంపాలని అన్నారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభమవుతాయన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని వెల్లడించారు.