హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఇటీవల దుబాయి నుంచి ముస్తాబాద్ మండలానికి వచ్చిన ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి భార్య, తల్లితో పాటు స్నేహితుడుకి ఒమిక్రాన్ సోకింది. దీంతో అధికారులు బాధితులను హైదరాబాద్లోని టిమ్స్కు చికిత్స కోసం అందించారు. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ వారి కాంటాక్టులను గుర్తించి, వారికి పరీక్షలు చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. తాజా కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కు పెరిగింది.