సిరిసిల్ల రూరల్:సిరిసిల్ల మానేరు వాగులో (Maneru vagu) గల్లంతైన ఆరో తరగతి విద్యార్థి సింగం మనోజ్ (16) మృతదేహం లభించింది. ఈనెల 15 న మానేరు వాగులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఘటన జరిగిన రోజే కొలిపక గణేశ్ మృతదేహం లభించగా, జడల వెంకట సాయి (13), శ్రీరామ్ క్రాంతికుమార్ (13, తీగల అజయ్ (14), కొంగ రాకేష్ (11) మృతదేహలు మంగళవారం లభ్యమైన విషయం తెలిసిందే.
కాగా, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు, కరీంనగర్ నుంచి రెస్క్యూ టీం, సిరిసిల్ల, పోలీసుల సహాయంతో సోమవారం రాత్రి నుంచి నిర్విరామంగా గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో
బుధవారం ఉదయం 8.30 గంటలకు మానేరు వాగులో ముళ్లకంపలో చిక్కుకున్న మనోజ్ మృతదేహాన్ని వెలికి తీశారు
. దీంతో మనోజ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.