జనగామ : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో విశ్రాంత ఉపాధ్యాయుడు( Retired teacher) మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో చోటు చేసుకుంది. రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్యకు పదవీ విరమణ ప్రయోజనాలు (Retirement benefits) సకాలంలో అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనకు రావాల్సిన 10,77,528 రూపాయలను 21 నెలలు గడిచినా ప్రభుత్వం చెల్లించలేదు. అలాగే పలువురు బంధువులు కూడా తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వకపోవడం, తను తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సుమారు 20 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.