హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : భోపాల్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
పరారీలో ఉన్న హెచ్యూటీ సభ్యుడు సల్మాన్ను హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. సల్మాన్ దగ్గర్నుంచి హార్డ్ డిస్లు, పెన్డ్రైవ్లు, ఎస్డీకార్డ్, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకొన్నారు.