హైదరాబాద్ : తెలంగాణలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. గురువారం కొత్తగా రాష్ట్రంలో మరో ఐదు కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67కు పెరగ్గా.. తాజాగా 22 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఒకరు వైరస్ బారినపడి మృతి చెందారు. 206 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,563 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. భారత్లో ఇవాళ ఒకే రోజు 31 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హర్యానాలో 23, తెలంగాణలో ఐదు, అసోంలో మూడు కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య వెయ్యి మార్క్ను దాటగా.. 1,007కు పెరిగాయి.