మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకం మరో ఆటో డ్రైవర్ను బలితీసుకున్నది. ప్రయాణికులు లేక.. గిరాకీ రాక.. బతుకు భారమై.. కుటుంబ పోషణ కష్టమై ఓ ఆటోడ్రైవర్ తనువు చాలించాడు. ఈ ఘటన బుధవారం మహబూబ్నగర్లో చోటుచేసుకున్నది. జిల్లా కేంద్రంలోని బొక్కలోనిపల్లికి చెందిన పిచ్చికుంట్ల దేవేందర్ (23) ఆటో నడుపుతూ కొన్నేండ్లుగా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచి త ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో మూ డు నెలలుగా ఆటోకు గిరా కీ రావడం లేదు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆటో డ్రైవర్కు కుటుంబ పోషణ భారమైంది. చేసేది లేక.. బుధవారం సాయంత్రం బండమీదిపల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ తెలిపారు.