TSPSC | ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరికొంత మంది అభ్యర్థులపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటు వేసింది. కేసులో నిందితులుగా ఉన్న 13 మంది నిందితులను శాశ్వతంగా డిబార్ చేసింది. వీరు భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకున్నది. ఈ మేరకు ఆయా జాబితాను టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ బుధవారం విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డిబార్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 13 మందిని డిబార్ చేయగా.. మొత్త డిబార్ అయిన వారి సంఖ్య 50కి చేరింది.