మోత్కూరు/ హుజూర్నగర్ రూరల్/ కోటపల్లి, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ మంత్రి సురేఖ, జనగామ సర్పంచ్ గట్టు లక్ష్మణ్గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలకు సర్పంచ్లు క్షీరాభిషేకం చేశారు.