కరీంనగర్ : జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్లో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. కరీంనగర్లో రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని.. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేని లోటు తీరిపోయిందని మంత్రి అన్నారు. సంవత్సరంన్నర లోగా కళాశాల పనులు పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కరీంనగర్పై ఉన్న అభిమానంతో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ప్రకటించారన్నారు.