ఇల్లంతకుంట, అక్టోబర్ 28: బీజేపీని నమ్ముకొని వచ్చిన ఉద్యమకారులను రాజకీయంగా ప్రోత్సహించకుం డా నట్టేట ముంచిందని, విద్యార్థినాయకులను పూర్తిగా విస్మరించిందని ప్రజాగాయకుడు దరువు ఎల్లన్న విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్యభవన్లో శనివారం మీడియా సమావేశం లో మాట్లాడారు.
విద్యార్థి ఉద్యమ నేత లకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. ప్రస్తుత ఎన్నికల సమయంలో పట్టించుకోవడం లేదని మం డిపడ్డారు. సరైన గుర్తింపు లేకపోవడంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు దరువు ఎల్లన్న ప్రకటించారు. తనతోపా టు ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల కు చెందిన 22 మంది కీలక నాయకు లు రాజీనామా చేశారని తెలిపారు.