జయశంకర్ భూపాలపల్లి, జనవరి 13 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్లో సీపేజ్లకు మరమ్మతు పనులను నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ శనివారం ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి)బరాజ్లో గతేడాది అక్టోబర్లో భారీ వర్షాల కారణంగా 38, 28 ఔట్లెట్స్ వద్ద చిన్న చిన్న సీపేజ్లు ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పుడే అప్రమత్తమైన అధికారులు స్టోన్, మెటల్, ఇసుకతో తాత్కాలిక ట్రీట్మెంట్ చేసి లీకేజీని అదుపు చేశారు. సీపేజ్ నుంచి ఇసుక బయటికి పోకుండా అడ్డుకున్నారు.
ఇటీవల రాష్ట్ర మంత్రుల బృందం అన్నారం బరాజ్ను పరిశీలించి రెండు సీపేజ్లతో ప్రమాదమేమీ లేదని తేల్చింది. నిర్మా ణ సంస్థతో గ్రౌటింగ్ చేయించాలని చెప్పి వెళ్లింది. దీంతో అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్.. ప్రత్యేంగా హిమాచల్ప్రదేశ్ నుంచి హెలిక్యాప్టర్లో పాలీ యూరిత్రిన్ అనే కెమికల్ను తెప్పించి బరాజ్లోని 38వ ఔట్లెట్ వద్ద సీపేజ్కు గ్రౌటింగ్ పనులను ప్రా రంభించింది. ఆప్కాన్స్ సంస్థకు చెందిన 25 మంది నిపుణులు పనుల్లో నిమగ్నమయ్యా రు. అనంతరం 28వ ఔట్లెట్ వద్ద సీపేజ్కు గ్రౌటింగ్ చేస్తారు. సుమారు 15 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. గ్రౌటింగ్ తర్వాత బరాజ్లోని నీటిని బయటకు పంపి ప్రభుత్వం అప్పగించిన పార్సన్ అనే ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ పనులు ప్రారంభిస్తారు.