ఇల్లంతకుంట, ఫిబ్రవరి 19: రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బిక్కవాగుకు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సోమవారం ఇల్లంతకుంటలోని బిక్కవాగు బ్రిడ్జిపై బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నీరందక యాసంగి పంటలు ఎండిపోతున్నాయని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వెంటనే కాంగ్రెస్ సర్కారు స్పందించి నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. నిరుడు ఎండకాలంలో అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ రిజర్వాయర్కు కాళేశ్వరం జలాలను తరలించి పంటలను కాపాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.