హనుమకొండ సబర్బన్, డిసెంబర్7: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు(Annamaneni Gopal Rao) తన పదవికి రాజీనామా(Resigned) చేశారు. ఈ మేరకు గురువారం తన రాజీనామా పత్రాన్ని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్పీడీసీఎల్ ఇక ముందు కూడా మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు ఇంతకుముందే రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని ప్రకటించారు.