చార్మినార్, అక్టోబర్ 7: ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షుడు మరణించిన ఘటన నెహ్రూ జులాజికల్ పార్క్లో చోటు చేసుకున్నది. యానిమల్ కీపర్గా జూపార్క్లో విధులు నిర్వర్తిస్తున్న షాబాజ్ (23) శనివారం మధ్యాహ్నం తన విధులు ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఎన్క్లోజర్లోని మగ ఏనుగు షాబాజ్పై ఆకస్మికంగా దాడి చేసింది.
ఈ ఘటనలో షాబాజ్కు తీవ్ర గాయాలు కావడంతో సిబ్బంది, జూ అధికారులు డీఆర్డీవో అపోలో దవాఖానకు తరలించారు. మార్గమధ్యలోనే షాబాజ్ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారని జూ అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల జూ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.