హైదరాబాద్ : మునుగోడు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ,
థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీకి అమ్ముడుపోయి మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారని, తమ స్వార్థం కోసం ప్రజల అభిమానాన్ని సొమ్ము చేసుకునే కోమటిరెడ్డి లాంటివారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తాగునీటి కోసం గోసపడిన మునుగోడు ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించి సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ సర్కారు.. తెలంగాణ ప్రభుత్వాన్ని స్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కోమటిరెడ్డి అసలు ఎందుకు రాజీనామా చేశాడో ఓటేసే ముందు ఒక్కసారి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు.