Anil Kurmachalam | హైదరాబాద్ : తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం అని టీఎస్ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనిల్ కుర్మాచలం మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎన్నారైలంతా కలిసి పని చేస్తున్నాని అనిల్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎంతో ఉందన్నారు. తెలంగాణను దేశంలో తిరుగులేని రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. ప్రస్తుతం కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించామని ప్రజలు బాధపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేవలం రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. కాబట్టి పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తారని అనిల్ కుర్మాచలం తెలిపారు.