చండ్రుగొండ, నవంబర్ 26: గొత్తి కోయలను తమ గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామస్థులు తీర్మానం చేశారు. సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న చండ్రుగొండ ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును గొత్తికోయలు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. శాంతియుతంగా జీవిస్తున్న గ్రామంలో గొత్తికోయలు బీభత్సం సృష్టించారని, వారి వల్ల గ్రామస్థులకు ప్రాణహాని ఉన్నదని సర్పంచ్ అన్నారు. ఇకపై తమ గ్రామానికి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారిని అనుమతించబోమని పేర్కొన్నారు.