హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తిరుమలలో చిరుత దాడి లో చిన్నారి లక్షిత మృత్యువాత పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ బాలల పరిరక్షణ కమిషన్ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి నివేది క సమర్పించాలని టీటీడీ, అటవీ, పో లీస్, రెవెన్యూ శాఖలను కమిషన్ చైర్మ న్ అప్పారావు ఆదేశించారు. గత జూన్ 22న నాలుగేండ్ల కౌశిక్ కూడా చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన ఘటనపైనా కమిషన్ స్పందించింది.
కౌశిక్ ఘటన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకొన్నారని, పూర్తిస్థాయిలో వన్యప్రాణు ల వివరాలు సేకరించాలని, లక్షిత మృ తిపై వారంల్లో నివేదికను సమర్పించాలని అధికారులను చైర్మన్ ఆదేశించా రు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. కాలినడక దారిలో తక్షణమే పూర్తిస్థాయి సీసీ కెమెరాలు, ఇనుమ కంచెలు, విద్యుద్దీపాలు, రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.