భీమదేవరపల్లి, నవంబర్ 1: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం కొత్తకొండ గ్రామంలోని బర్రె గుడి సమీపంలో గల వ్యవసాయ భూమిలో మంగళవారం పురాతన రాతి పాత్ర లభ్యమైంది. చరిత్రకారుడు చొల్లేటి శ్రీనివాస్, కొత్తకొండకు చెందిన సిద్దమల్ల రాజేందర్కు ఈ పాత్ర లభించింది.
పురాతన కాలంలో మానవులు వీటిని ఇంటి సామగ్రిగా వినియోగించేవారు. కాగా ఇదే వ్యవసాయ భూమిలో ఇంకో చరిత్రకారుడు ఇటీవల పరిశోధనలు చేయగా బలుపం రాయితో చెక్కిన ఓ పాత్ర దొరికినట్టు తెలిసింది.