పరిశీలించిన చరిత్ర పరిశోధకులు తుమ్మల
దిలావర్పూర్. మార్చి 16: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఏక్నాథ్ ఆలయ సమీపంలోని మట్టి దిబ్బలో సోమవారం రెండో కృష్ణుడి (రాష్ట్ర కూటుల కాలం) నాటి శాసనాలు వెలుగులోకి వచ్చినట్టు చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల ఏండ్ల చరిత్రను పరిశోధకులు వెలుగుతీస్తున్న క్రమంలో దిలావర్పూర్లో 821వ సంవత్సరానికి చెందిన శాసనాలు వెలుగులోకి రావడం నిర్మల్ చరిత్రకు అద్దం పడుతున్నదని వారు తెలిపారు. నిర్మల్ జిల్లాలో అనేక శాసనాలను ఇదివరకు గుర్తించి పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. గతంలో కూడా దిలావర్పూర్లో మూడు శాసనాలు వెలుగులోకి తెచ్చినట్టు చెప్పారు.