చిన్నశంకరంపేట, నవంబర్ 8: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలోని కామారం గ్రామాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. చెరువు కట్టపై ఉన్న పురాతన విగ్రహాలను పరిశీలించారు.
ఈ శిల్పాలు రాష్ట్ర కూటుల కాలం 8, 9వ శతాబ్దానికి చెందినవని తెలిపారు. చాళుక్యుల కాలం నుంచి చాలా ప్రసిద్ధి చెందినవి అని పేర్కొన్నారు. చెరువు కట్టకు కొద్ది దూరంలో మరో రెండు విగ్రహాలు ఉన్నాయన్నారు. చరిత్రకు సజీవంగా నిలిచే శిల్పాలను సంరక్షించి కాపాడుకోవాలని సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్కు సూచించారు.