హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ)/పుల్కల్: మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీకి ఆదివారానికి 24వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 68 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 83 వేల క్యూసెక్కుల కు పెరిగింది. లక్ష్మీబరాజ్ వద్ద 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవ్వగా, వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 21వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది.